interest వడ్డీతో రుణాలు రెన్యువల్ చేయాలి
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:17 AM
వడ్డీ కట్టించుకొని వ్యవసాయ రుణాలు రెన్యువల్ చేయాలని రైతులు స్థానిక ఎస్బీఐ బ్యాంక్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు.
తనకల్లు, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): వడ్డీ కట్టించుకొని వ్యవసాయ రుణాలు రెన్యువల్ చేయాలని రైతులు స్థానిక ఎస్బీఐ బ్యాంక్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఏపీ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. గతంలో బ్యాంక్ అధికారులు వడ్డీలు కట్టించుకుని రుణాలు రెన్యువల్ చేశారని, ప్రస్తుతం అసలు, వడ్డీ క చెల్లిస్తేనే రెన్యువల్ చేస్తామని చెప్పడం అన్యాయమని అన్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని బ్యాంక్ మేనేజర్కు అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు శివన్న, వీవీ రమణ, ఎస్వీ రమణ, చలపతి, శ్రీనివాసులు, నాగేంద్ర, సీఐటియు ఒట్టెందు వేమన్న, సీపీఐ మండలకార్యదర్శి రెడ్డెప్ప, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 12:17 AM