Jeedipally జీడిపల్లి రిజర్వాయర్ పరిశీలన
ABN, Publish Date - Jun 11 , 2025 | 11:40 PM
మండలంలోని జీడిపల్లి, కోణంపల్లి గ్రామాల్లో బుధవారం ట్రైనీ కలెక్టర్ల బృందం పర్యటించింది.
బెళుగుప్ప, జూన 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని జీడిపల్లి, కోణంపల్లి గ్రామాల్లో బుధవారం ట్రైనీ కలెక్టర్ల బృందం పర్యటించింది. ఈ బృందం లో సచిన రాహర, నరేంద్ర ఫాడల్, పృథ్వీరాజ్ కుమార్, పరిహీన జాహి ద్, మనీషా సందీప్, రఘువంశీ, నాగ వెంకటసాహిత ఉన్నారు. రిజర్వాయరు గురించి హంద్రీనీవా అధికారులు వారికి వివరించారు. అనంతరం కోణంపల్లిలో డ్రిప్ పద్ధతిలో సాగును హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఫిరోజ్ ఖాన వివరించారు. వీరి వెంట హంద్రీనీవా ఎస్ఈ రాజస్వరూ్పకుమార్, ఈఈ శ్రీనివాసు, ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ అనిల్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారులు కృష్ణతేజ, మల్లేష్ ఉన్నారు.
Updated Date - Jun 11 , 2025 | 11:40 PM