step down పరిపాలన చేతకాకపోతే దిగిపోండి
ABN, Publish Date - May 16 , 2025 | 12:08 AM
పరిపాలన చేతకాకపోతే తక్షణమే దిగిపోవాలని టీడీపీ పోర్లీడర్ రత్నప్పచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుట్టపర్తి, మే 15(ఆంధ్రజ్యోతి): పరిపాలన చేతకాకపోతే తక్షణమే దిగిపోవాలని టీడీపీ పోర్లీడర్ రత్నప్పచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన తుంగా ఓబుళపతి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే చైర్మన తప్పా మిగిలిన వైసీపీ కౌన్సిలర్లు అందరూ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. రత్నప్ప చౌదరి మాట్లాడుతూ... ప్రజా సమస్యలు పాలక వర్గానికి ఏ మాత్రం పట్టిలేదని, ఇక ఈ సమావేశాలు ఎందుకు అని, పాలక వర్గాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరుసగా మూడు సమావేశాలు జరపకపోతే ఆ పాలకవర్గాన్ని రద్దు చేయవచ్చని, దీనిని పరిగణలోకి తీసుకుని పాలకవర్గాన్ని రద్దు చేయాలని అధికారులను కోరారు. చైర్మన, వైసీపీ కౌన్సిలర్లకు పరిపాలన, ప్రజాసమస్యలపై ఏ మాత్రం చిత్త శుద్ధి లేదన్నారు. సమావేశానికి హాజరైన టీడీపీ కౌన్సిలర్లు అందరూ అజెండాలో సంతకాలు చేయకుండా వెళ్లిపోయారు.
Updated Date - May 16 , 2025 | 12:08 AM