TDP ‘గోబ్యాక్ .. రంగయ్య’ : టీడీపీ
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:04 AM
సేవ్ ఆర్డీటీ పేరుతో తలారి రంగయ్య చేస్తున్న పాదయాత్ర రాజకీయ యాత్రగా మారిందంటూ టీడీ పీ శ్రేణులు గురువారం నిరసన చేపట్టారు
రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు
బ్రహ్మసముద్రం, జూన 5(ఆంధ్రజ్యోతి): సేవ్ ఆర్డీటీ పేరుతో తలారి రంగయ్య చేస్తున్న పాదయాత్ర రాజకీయ యాత్రగా మారిందంటూ టీడీ పీ శ్రేణులు గురువారం నిరసన చేపట్టారు. మండలంలోని బొమ్మగానిపల్లి వద్ద గోబ్యాక్ రంగయ్య అంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో స్థానిక వైసీపీ నాయకులు కూడా రోడ్డుకు మరోవైపు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని ఇరుపార్టీల వారిని కోరారు. దీంతో అక్కడ ఉద్రి క్త వాతావరణం నెలకొంది. కాగా, ఎమ్మెల్యే అమిలినేని ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు ఆందోళన విరమించారు.
Updated Date - Jun 06 , 2025 | 12:04 AM