irregularities అక్రమాలపై విచారణ చేపట్టాలి
ABN, Publish Date - Mar 17 , 2025 | 11:25 PM
స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో 650-2 సర్వేనెంబరులో ఫ్లంబర్స్ సంఘం పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని సీపీఐ నియోజకవర్గ ఇనచార్జి ముసుగు మధు డిమాండ్ చేశారు.
ధర్మవరం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో 650-2 సర్వేనెంబరులో ఫ్లంబర్స్ సంఘం పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని సీపీఐ నియోజకవర్గ ఇనచార్జి ముసుగు మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ నాయకులు, ఫ్లంబర్స్ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు. పేదల పేర్లు చెప్పుకుని కొందరు ఫ్లంబర్స్ సంఘం నాయకులు రూ.50 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో నొక్కేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టి.. అవినీతికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - Mar 17 , 2025 | 11:25 PM