ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ACB Court: వాసుదేవరెడ్డి,సత్యప్రసాద్‌లకు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

ABN, Publish Date - Jul 19 , 2025 | 04:01 AM

మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్న కీలక నిందితులకు ఉపశమనం దక్కలేదు.

ACB Court
  • పిటిషన్లను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

విజయవాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్న కీలక నిందితులకు ఉపశమనం దక్కలేదు. వైసీపీ హయాంలో రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వ్యవహరించిన డి.వాసుదేవరెడ్డి(ఏ-2), ప్రత్యేకాధికారిగా ఉన్న సత్యప్రసాద్‌ (ఏ-3)లకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం నిరాకరించింది. కసిరెడ్డిని సిట్‌ అరెస్టు చేసినప్పటి నుంచి నిందితుల అరెస్టులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తమకూ సంకెళ్లు పడతాయని భావించిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ కోసం శుక్రవారం కోర్టును ఆశ్రయించారు. అయితే వాటిని న్యాయాధికారి పి.భాస్కరరావు తిరస్కరించారు.

Updated Date - Jul 19 , 2025 | 04:07 AM