ఇంకా వరద గుప్పిట్లో విజయవాడ..
ABN, Publish Date - Sep 03 , 2024 | 08:47 AM
విజయవాడ: రెండు రోజులుగా వణికిస్తున్న వరద ఉధృతికి సుమారు 2 లక్షల 70 వేల మంది ముంపు బారిన పడగా సోమవారం నాటికి 70 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. మరో 2 లక్షల మంది ఇంకా ముంపులోనే ఉన్నారు. వారికి ఆహారం, తాగునీరు అందించే ప్రక్రియ నడుస్తోంది.
విజయవాడ: రెండు రోజులుగా వణికిస్తున్న వరద ఉధృతికి సుమారు 2 లక్షల 70 వేల మంది ముంపు బారిన పడగా సోమవారం నాటికి 70 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. మరో 2 లక్షల మంది ఇంకా ముంపులోనే ఉన్నారు. వారికి ఆహారం, తాగునీరు అందించే ప్రక్రియ నడుస్తోంది. కృష్ణా నదికి 11లక్షల 40 వేల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడలోని భవానీపురం, బ్యారేజ్ దిగువన ఉన్న రామలింగేశ్వర నగర్ ప్రాంతాలు మునిగిపోయాయి. కృష్ణనది వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద బయటకు వచ్చి వేంపార్కును ముంచేసింది. జాతీయ రహదారి మీదుగా భవానీపురంలోకి వరద ప్రవేశించడంతో ఆ ప్రాంతంలో మూడడుగులమేర వరద నిలిపోయింది.
మరోవైపు రామలింగేశ్వర ప్రాంతంలో కృష్ణానదిలోకి కలిసే ఔట్ ఫర్ లైన్ల నుంచి వరదనీరు ఎగదన్నడంతో ఆ ప్రాంతంలో నలుగు అడుగులకుపైగా వరద వచ్చేసింది. మరోవైపు బుడమేరు వరద నిన్న (సోమవారం) కూడా కొనసాగింది. అయితే సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అందడంలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సమస్థ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి పరుగులు పెట్టిస్తున్నా.. ఇంకా వేలాదిమంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..
జగన్ భక్త అధికారులపై సీఎం సీరియస్..
రిటైనింగ్ వాల్ ఉన్న వరద ఎలా వచ్చింది..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 03 , 2024 | 08:47 AM