జగన్ భక్త అధికారులపై సీఎం సీరియస్..
ABN, Publish Date - Sep 03 , 2024 | 07:48 AM
అమరావతి: జగన్ భక్త అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సీరియస్ అయ్యారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సాక్షాత్తు ఓ మంత్రి ఫిర్యాదు చేయడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.
అమరావతి: జగన్ భక్త అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సీరియస్ అయ్యారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సాక్షాత్తు ఓ మంత్రి ఫిర్యాదు చేయడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యం వహించిన అధికారుల తీరుపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో మిగతా అధికారులంతా ఆశ్చర్యపోయారు.
విజయవాడలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు కలెక్టరేట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో వరద బాధితుల కోసం అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా.. పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో ప్రశ్నించారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతుందని ఓ మంత్రి సమావేశంలో వివరించారు. జగన్ భక్త అధికారులగా ముద్రపడి నాడు వైసీపీతో అంటకాగిన అధికారులు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉందని ఆ మంత్రి తెలిపారు. పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దేశపూర్తకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న తీరును తాను గుర్తించినట్లు ఆ మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిటైనింగ్ వాల్ ఉన్న వరద ఎలా వచ్చింది..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 03 , 2024 | 07:49 AM