ఊరేగింపులు ఇష్టం లేదు: పవన్ కల్యాణ్
ABN, Publish Date - Jul 01 , 2024 | 12:27 PM
పిఠాపురం: రాష్ట్రంలో ఎన్నికలు జరిగి.. ఫలితాలు విడుదల అయిన తర్వాత తొలిసారిగా పిఠాపురానికి వచ్చానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా..
పిఠాపురం: రాష్ట్రంలో ఎన్నికలు జరిగి.. ఫలితాలు విడుదల అయిన తర్వాత తొలిసారిగా పిఠాపురానికి వచ్చానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా పిఠాపురంలో జరుగుతున్న పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తాను ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకు రాలేదంటే.. తనకు ఊరేగింపులు జరుపుకోవడం ఇష్టం లేదని, పనిలోకి వెళ్లాలని అనుకున్నానని, ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పగలనో.. ఈరోజు వచ్చి లబ్దిదారులకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ నెల 4న ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
పింఛన్ దారుల కాళ్లు కడిగిన మంత్రి
ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం: చంద్రబాబు
ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నాం: లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 01 , 2024 | 12:27 PM