హిడెన్ కెమెరా ఘటనపై సర్కార్ సీరియస్ ..
ABN, Publish Date - Aug 30 , 2024 | 01:42 PM
కృష్ణా జిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరా ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. హిడెన్ కెమెరా వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్రతోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను సంఘటన ప్రదేశానికి వెళ్లాలని తెలిపారు.
కృష్ణా జిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరా ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. హిడెన్ కెమెరా వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్రతోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను సంఘటన ప్రదేశానికి వెళ్లాలని తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
హిడెన్ కెమెరా ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ హాస్టల్ వాష్ రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. హిడెన్ కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నారంటూ బీటెక్ ఫైనలియర్ విద్యార్థిపై సహచర హాస్టల్ విద్యార్థులు దాడికి యత్నించారు. కాలేజీ హాస్టల్కు చేరుకున్న పోలీసులు జూనియర్, సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఫైనలియర్ విద్యార్థిని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అసలు దీని వెనుక ఎంతమంది ఉన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నల్గొండ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం
భార్యకు ప్రేమతో.. 8 అడుగుల స్మృతి చిహ్నం..
యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 30 , 2024 | 01:42 PM