నల్గొండ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Aug 30 , 2024 | 12:59 PM
నల్గొండ జిల్లా: గుండ్రాంపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీపతి ల్యాబ్ కంపెనీ ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్యూ3 బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి.
నల్గొండ జిల్లా: గుండ్రాంపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీపతి ల్యాబ్ కంపెనీ ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్యూ3 బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదం నుంచి కార్మికులు సురక్షితంగా బయట పడ్డారు. హైదరాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై పొగ వ్యాపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రియాక్టర్ పేలిన సమయంలో కార్మికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భార్యకు ప్రేమతో.. 8 అడుగుల స్మృతి చిహ్నం..
యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన..
నిందితులకు శిక్ష పడాలి: జెత్వాని
ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై సర్కార్ ఫోకస్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 30 , 2024 | 12:59 PM