ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ABN, Publish Date - Aug 30 , 2024 | 09:22 AM
అమరావతి: ఏపీలో చంద్రబాబు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం షాపులకు గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీ ముగింపు దశకు చేరింది. సెప్టెంబరు తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కనిపించవు.
అమరావతి: ఏపీలో చంద్రబాబు కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం షాపులకు గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీ ముగింపు దశకు చేరింది. సెప్టెంబరు తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కనిపించవు. పూర్తిగా ప్రైవేటు షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలపై ఆ శాఖ అధికారులు అధ్యయనం చేసి ఇటీవల ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వాటిలో తెలంగాణ తరహా పాలసీనే ఉత్తమంగా ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. తాజాగా ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ ముందు ఈ నివేదికలు ఉంచి పాలసీకి తుది రూపు తీసుకురానున్నారు. అయితే దాదాపుగా తెలంగాణ పాలసీకే ప్రభుత్వ వర్గాలు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నిందితులకు శిక్ష పడాలి: జెత్వాని
ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై సర్కార్ ఫోకస్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 30 , 2024 | 09:38 AM