నిందితులకు శిక్ష పడాలి: జెత్వాని
ABN, Publish Date - Aug 30 , 2024 | 08:23 AM
హైదరాబాద్: అక్రమ కేసులు పెట్టీ తనను ఏపీ పోలీసులు, అధికారులు అనేక విధాలుగా వేధించారని, దానికి సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ముంబై సినీనటి, బాధితురాలు జెత్వాని అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్కు వచ్చిన ఆమె శంషాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: అక్రమ కేసులు పెట్టీ తనను ఏపీ పోలీసులు, అధికారులు అనేక విధాలుగా వేధించారని, దానికి సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ముంబై సినీనటి, బాధితురాలు జెత్వాని అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్కు వచ్చిన ఆమె శంషాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. తన దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అందిస్తానన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడకు బయలుదేరి వెళతాన్నారు.
‘‘నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను.. సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హాననం చేస్తూ మాట్లాడుతున్నారు.. నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.. ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది..ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలి. ఎవరికీ ఇలా జరగకూడదు.. ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపాలి.. నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు’’.. అంటూ జెత్వాని వాపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై సర్కార్ ఫోకస్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 30 , 2024 | 08:23 AM