యూపీ ప్రభుత్వం కొత్త పాలసీ..

ABN, Publish Date - Aug 30 , 2024 | 07:28 AM

ఉత్తరప్రదేశ్: ఎవరేమనుకున్నా తన పంథా మార్చుకోబోమని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అంటోంది. ఓ వైపు శిక్షణతో.. మరోవైపు నజరానాలతో సోషల్ మీడియాలో కంటెంట్‌ను నియంత్రించాలనుకుంటోంది.

ఉత్తరప్రదేశ్: ఎవరేమనుకున్నా తమ పంథా మార్చుకోబోమని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అంటోంది. ఓ వైపు శిక్షణతో.. మరోవైపు నజరానాలతో సోషల్ మీడియాలో కంటెంట్‌ను నియంత్రించాలనుకుంటోంది. బీజేపీ సర్కార్ కొరడా ఝులిపిస్తోంది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా కొత్త సోషల్ మీడియా విధానాన్ని తీసుకువచ్చింది. వాటితోపాటు దోషులకు భారీగా జరీమానాలు విధిస్తూ ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ 2024ను కేబినెట్ ఆమోదించింది.


రాష్ట్ర సమాచారశాఖ రూపొందించిన ఈ విధానానికి యూపీ కేబినెట్ ఓకే చెప్పేసింది. అశ్లీలత, ఇతరులు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులుపెట్టే వారిపై క్రిమినల్ కేసులు పెట్టనుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్టులపై ఐటీ యాక్టులోని సెక్షన్ 66 ఈ, సెక్షన్ 66 ఎఫ్ ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఇకపై కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు కానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉచ్చు బిగుస్తోంది!

రేవంత్‌ వ్యాఖ్యలు సరి కావు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 30 , 2024 | 07:28 AM