ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: పులి సంచారంపై అటవీ శాఖ అప్రమత్తం.. ఆ గ్రామాలకు అలర్ట్..

ABN, Publish Date - Nov 30 , 2024 | 08:35 AM

జిల్లాలో మహిళపై పులి దాడి చేసి చంపడంతో తెలంగాణ అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. నిన్న(శుక్రవారం) దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధరించారు.

కొమురం భీం: జిల్లాలో మహిళపై పులి దాడి చేసి చంపడంతో తెలంగాణ అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. నిన్న(శుక్రవారం) దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈజ్గామ్, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ అమలు చేశారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


కాగా, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువతిపై శుక్రవారం పులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గన్నారం గ్రామానికి చెందిన మోహిర్లె లక్ష్మి అనే యువతి తోటి మహిళలతో కలిసి పత్తి చేలో పని చేసేందుకు శుక్రవారం ఉదయం నజ్రూల్ నగర్ గ్రామానికి వెళ్లింది. అయితే లక్ష్మి పత్తి ఏరుతుండగా అక్కడే మాటు వేసిన పులి ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. మెడ భాగాన్ని కరవడంతో ఆమెకు తీవ్ర గాయమైంది. దాడిని గమనించిన తోటి కూలీలు కేకలు వేయడంతో పులి అక్కడ్నుంచి పారిపోయింది.


అయితే బాధితురాలు లక్ష్మీని గ్రామస్థులు కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబసభ్యులు, స్థానికులు, రాజకీయ పార్టీల నేతలు యువతి మృతదేహంతో అటవీ శాఖ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన తీవ్రతరం కావడంతో ఆయా డిమాండ్లు నెరవేరుస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో పులి సంచారంపై అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో డ్రోన్‌తో స్ప్రే..

CM Revanth Reddy: రేవంత్‌ భరోసా!

Updated Date - Nov 30 , 2024 | 10:16 AM