Home » Adilabad
జిల్లా కేంద్రంలో రహదారుల ఆక్రమణల తొలగింపు ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యా దులు వచ్చినప్పుడో, రాజకీయ ఒత్తిళ్లతోనో షెడ్లను కూల్చివేయడం, ఆ తరువాత విస్మరించడం మున్సిపల్ అధికారులకు అలవాటుగా మారింది.
ఎన్నికలప్పుడే నాయకులు గ్రామానికి వచ్చి హామీలు ఇస్తారని, అనంతరం హామీలను నెరవేర్చడం లేదని మండలంలోని రాజా రం గ్రామస్థులు వాపోయారు. అందుకే ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయమని వారు తీర్మానించారు. దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులంతా మంగళవారం మా మిడితోటలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఓట్లు వేయవద్దని తీర్మానించారు.
మార్కులు ర్యాంకులు ప్రధానమైనవి కావని, విలు వలతో కూడిన విద్య అందినప్పుడే విద్యార్ధికి భవిష్యత్ ఉంటుందని విద్యా శాఖ జిల్లా సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు.
మందమర్రిలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదా రులు ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారని తు డుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిందర్ ఆరోపిం చారు.
పుస్తక పఠనంతో విద్యార్థులు మరింత విజ్ఞానం పొందవచ్చని లక్షెట్టిపేట ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గఫార్ అన్నారు. తాని మడుగు జీపి పరిదిలోని బేహరన్గూడలో సావిత్రి బాయిఫూలే గ్రంఽథాలయాన్ని గ్రామ పటేల్, గిరిజను లతో కలిసి ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోడు దొంగలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.
మట్టి పైపుల పరిశ్రమ మసకబారుతోంది. ఆధునిక కాలంలో గృహ నిర్మాణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. త్వరిత గతిన పనులు పూర్తయ్యేలా నిర్మాణంలో సరికొత్త వస్తు సామగ్రిని ఉప యోగిస్తున్నారు.
ప్రజా ఉద్య మాల నిర్మాణానికి పార్టీని, ప్రజా సంఘాలను సన్న ద్ధ పర్చడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావా లని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు.
మ్యాదరిపేటలో లక్ష్మినారాయణస్వామి కల్యాణాన్ని శంకర్ శర్మ వేదమం త్రోచ్ఛారణ మధ్య ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ వ్యవస్ధాపకులు లింగాల శ్రీమతి సమక్ష్యంతో ఆల య వార్షికోత్సవం సంద ర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు.