Home » Adilabad
బడ్జెట్ అనగానే అన్నీ వర్గాల్లో భారీ అంచనాలు ఉంటాయి. పన్నుల విధింపు, మినహాయింపులు, కొత్త పథకాల కేటాయిం పులపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. గురువారం ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు తాత్కిలిక బడ్జెట్ ప్రవేశ పెట్టగా ఈసారి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వరాలు కురుస్తాయని భావిస్తున్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యంలో బుధవారం పిల్లల వైద్యులతో డీఎంహెచ్వో అనిత సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధు లను వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా నివారించవచ్చని తెలిపారు.
జిల్లాలో ముసురు వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం నుంచి మొదలైన వర్షం బుధవారం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 23.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హాజీపూర్ మండలం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 8,600 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్లలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి.
మండలంలో జ్వరపీడిత గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సం దర్శించి వైద్య సేవలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబ లే అవకాశం ఉందని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ప్రబలి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అందుకే జ్వర పీడిత గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలను, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూటీఎస్తోనే కృషి చేస్తోం దని సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఇన్నా రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా బుధ వారం దండేపల్లి, లింగాపూర్తోపాటు పలు పాఠ శాలల ఉపాధ్యాయులు సభ్యత్వం స్వీకరించారు.
పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైళ్ల సమస్య అధికంగా ఉండటం, దశాబ్దాల కాలంగా కొత్త రైళ్ళ కేటాయింపులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షా ల కారణంగా జిల్లాలోని గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవ హిస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ హిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో బ్యాక్ వాటర్ కారణంగా కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల మండలాల్లో వందల ఎకరాల్లో పత్తిపంట నీట మునిగింది.
సమస్యలు పరిష్కరిం చాలని తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయా లని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందించారు.
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎన్ఆర్ ఈజీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2023-24 ఆర్ధిక సంవత్సరం సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావే దిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంచిర్యాల పట్టణంలో వీధి కుక్కలు లేకుండా చూడాలని మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రావుల ఉప్పలయ్యకు వినతి పత్రం అందజేశారు.