PM Modi: చాలా బాగుంది, ఎన్డీయేకు కలిసొచ్చింది.. ఫేజ్-2పై మోదీ రియాక్షన్
ABN, Publish Date - Apr 26 , 2024 | 08:46 PM
రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తికాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో దశ చాలా బాగుందని, ఈసారి కూడా ఎన్డీయేకు కలిసి వచ్చిందని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: రెండో విడత లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్ పూర్తికాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో దశ చాలా బాగుందని, ఈసారి కూడా ఎన్డీయేకు కలిసి వచ్చిందని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.
Lok Sabha Elections 2024: రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకూ 61 శాతం పోలింగ్
''ఫేజ్-2 కూడా చాలా బాగుంది. ఓటు వేసిన దేశప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్డీయేకు లభించిన అసాధారణ మద్దతు విపక్షాలకు మరింత నిరాశకు గురిచేస్తుంది. ఎన్డీయే సుపరిపాలనను ఓటర్లు కోరుకుంటున్నారు. యువకులు, మహిళా ఓటర్లు బలమైన ఎన్డీయే మద్దతును బలపరుస్తున్నారు'' అని మోదీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. రెండో విడతలో భాగంగా అసోంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, జమ్మూకశ్మీర్లో 1, కర్ణాటకలో 14, కేరళలో 20, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 8, మణిపూర్లో 1, రాజస్థాన్లో 13, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్లో 8, పశ్చిమబెంగాల్లో 3 లోక్సభ స్థానాలకు శుక్రవారంనాడు పోలింగ్ జరిగింది. తదుపరి విడత (మూడో విడత) పోలింగ్ మే 7న జరుగనుంది. చివరి విడత జూన్ 1న జరుగనుండగా, జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Latest National News and Telugu News
Updated Date - Apr 26 , 2024 | 08:46 PM