AP News: వైసీపీ కార్యాలయాల కూల్చివేత చర్యలపై ఏపీ హైకోర్టులో ముగిసిన విచారణ
ABN, Publish Date - Jun 27 , 2024 | 05:17 PM
రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలను కూల్చివేయబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలు బుధవారం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ ముగిసింది.
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలను కూల్చివేయబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలు బుధవారం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ ముగిసింది. అయితే తీర్పును హైకోర్ట్ రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు యథాస్థితి కొనసాగేలా స్టేటస్ కో ఆదేశాలు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా వైసీపీ కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్దమైందంటూ ఆ పార్టీ బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తాను ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానంటూ ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది కోర్టుకు బుధవారం తెలిపారు. దీంతో కేసు విచారణను రేపటికి (గురువారం) వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపిన విషయం తెలిసిందే.
Updated Date - Jun 27 , 2024 | 05:17 PM