Fisherwomen : చల్లగా చూడమ్మ గంగమ్మతల్లీ
ABN, Publish Date - Dec 27 , 2024 | 04:34 AM
సునామీల్లాంటి విపత్తులు సంభవించకుండా చల్లగా చూడమ్మా గంగమ్మతల్లీ అని మత్స్యకారులు వేడుకున్నారు. 2004 డిసెంబరు 26న సంభవించిన...
ABN AndhraJyothy : సునామీల్లాంటి విపత్తులు సంభవించకుండా చల్లగా చూడమ్మా గంగమ్మతల్లీ అని మత్స్యకారులు వేడుకున్నారు. 2004 డిసెంబరు 26న సంభవించిన సునామీ లక్షలాది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అలాంటి విపత్తు మరోసారి రాకుండా చూడాలంటూ ఆ మరుసటి ఏడాది నుంచి డిసెంబరు 26న నగరంలో మత్స్యకార మహిళలు తీరానికి చేరుకుని సంద్రానికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం మత్స్యకార మహిళలు పాలు, పసుపు నీటిని నింపిన కలశాలను శిరస్సున మోస్తూ... పెదజాలారిపేట గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఊరేగింపుగా తీరానికి చేరుకున్నారు. కలశాల్లోని నీరు, పాలతో సంద్రానికి అభిషేకించి, పూజలు చేశారు.
- పెదవాల్తేరు, ఆంధ్రజ్యోతి
Updated Date - Dec 27 , 2024 | 04:34 AM