ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma: జగన్ ఢిల్లీ టూర్స్‌ సక్సెస్‌ అంటూ బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-31T19:05:12+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఢిల్లీ టూర్స్‌ విజయవంతం అయ్యాయనే చెప్పాలని టీడీపీ (TDP) నేత బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఢిల్లీ టూర్స్‌ విజయవంతం అయ్యాయనే చెప్పాలని టీడీపీ (TDP) నేత బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు. అవినాశ్‌ను కాపాడేందుకు వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో జగన్ సక్సెస్‌ అయ్యారని, జగన్ అధికారం ముందు సీబీఐ చేసిందంతా తుడిచిపెట్టుకుపోయిందని బోండా ఉమ ఆరోపించారు. అవినాశ్‌కు లభించింది తాత్కాలిక ఉపశమనమే అని వైసీపీ తెలుసుకోవాలన్నారు. సజ్జల అమాయకుడు అని సర్టిఫికెట్ ఇస్తున్నారని, వివేకాను అవినాశే చంపాడని సజ్జల ఇంట్లో పిల్లల్ని అడిగినా చెబుతారని, వివేకా హత్య కేసు నుంచి ఎవరూ, ఎప్పటికీ తప్పించుకోలేరని బోండా ఉమ మండిపడ్డారు.

మొత్తం ఐదు షరతులతో తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు అవినాశ్ ముందస్తు బెయిల్‌పై తీర్పు వెలువరించిది. ఇదిలా ఉండగా.. కీలక సాక్షి వాంగ్మూలాన్ని సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సీబీఐ సంచలన విషయాన్ని కోర్టు ముందు వెల్లడించింది.

Updated Date - 2023-05-31T19:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising