Home » Bonda Umamaheswara Rao
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో జేసీబీ వాహనాల ప్రారంభం ఆనందదాయకమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గతంలో ఈ ప్రాంత వాసులు అనేక సమస్యలతో ఇబ్బంది పడేవారన్నారు.
విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో టిడ్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహిళలు, విద్యార్థినిలకు క్యాన్సర్పై అవగాహన ఉండాలని బోండా ఉమ సూచించారు. ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలలో భయాన్ని తొలగిస్తాయన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ గుర్తు ఉందని, తప్పకుండా అమలు చేసి తీరుతామని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రూ. 240 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బోండా ఉమ పేర్కొన్నారు.
Bonda Uma: గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
Dola Sree Bala Veeranjaneya Swamy: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు ముందుగా నిర్ణయం తీసుకున్నారని మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతిలో భూమి కేటాయించారన్నారు. అమరావతి స్మృతి వనం పక్కనపెట్టి ఇక్కడ నిర్మాణం చేశారని మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.
Andhrapradesh: ‘‘మన రాష్ట్రం వెనకపడి ఉంది కానీ.. మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారు. విజన్ 2020 అంటే నవ్వారు.. కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి’’ అని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని.. ఒకటి హైదరాబాద్, అమరావతి అని తెలిపారు.