ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Kakani: బాలకృష్ణ రీల్ హీరో.. జగన్ రియల్ హీరో

ABN, First Publish Date - 2023-09-22T10:34:22+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు రూ.370 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) రూ.370 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Goverdhan Reddy)వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. 14 ఏళ్లు సీఎంగా చేశారు కాబట్టి చంద్రబాబు దోచుకోవడానికి అర్హుడు అనేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. సభలో చర్చ జరగకుండా టీడీపీ నేతలు ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. బాలకృష్ణ (MLA Balakrishna) రీల్ హీరో అని.. జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) రియల్ హీరో అని అన్నారు. రీల్ హీరోలు సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరని వ్యాఖ్యలు చేశారు. అనుచితమైన ప్రవర్తనతో వ్యవహరించేవారు అసలు నటుడే కాదన్నారు. దేవాలయం వంటి అసెంబ్లీలో తాను చేసిన పనికి ఒక కళాకారుడిగా బాలకృష్ణ సిగ్గుపడాలని మండిపడ్డారు. ‘‘మీరు నీతిమంతులైతే...దమ్ము ధైర్యం ఉంటే రండి చర్చిద్దాం. చంద్రబాబు దోపిడీ పై వివరింగా చర్చిద్దాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి’’ అంటూ టీడీపీ నేతలకు మంత్రి కాకాణి గోవర్ధన్ సవాల్ విసిరారు.

Updated Date - 2023-09-22T10:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising