ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna: రైతులకు జనవరి 5 లోపు కౌలు చెల్లించాలి

ABN, Publish Date - Dec 31 , 2023 | 07:49 PM

అమరావతి రాజధాని రైతులకు జనవరి 5వ తేదీ లోపు కౌలు చెల్లించాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) తెలిపారు. ఆదివారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

విజయవాడ: అమరావతి రాజధాని రైతులకు జనవరి 5వ తేదీ లోపు కౌలు చెల్లించాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) తెలిపారు. ఆదివారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కె.నారాయణ, కె. రామకృష్ణ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... జనవరి 4వ తేదీన భూరక్ష పథకం పాస్ పుస్తకాల ప్రతులను దగ్ధం చేస్తామని చెప్పారు. జనవరి 3వ తేదీన అంగన్వాడీ మహిళలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడిలో మద్దుతగా పాల్గొంటామని తెలిపారు. దారి మళ్లించిన నిధులను పంచాయతీలకు అప్పగించాలన్నారు. అక్రమంగా చేసుకున్న బై జ్యూస్ ఒప్పందాలు పూర్తిగా రద్దు చేసుకోవాలని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాల పైనా, కార్మికుల సమస్యలపైనా సీపీఐ పోరాటాలను కొనసాగిస్తుందని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 07:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising