Home » CPI
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం కొలువుదీరడానికి అడుగులు పడుతున్నా, మద్దతివ్వడానికి వామపక్షాలు, వీసీకే, కాంగ్రెస్ పెడుతున్న షరతులు విజయ్ తలని బొప్పికట్టించేలా ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు, వీసీకే తమ మద్దతుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశాయి.
టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు చర్చిస్తున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేత బినోయ్ విశ్వం చెబుతుంటే, అసెంబ్లీ వేదికగా టీవీకేకు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ(NIA) నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఖండించారు. తాము బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించలేదని ఆయన అన్నారు.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీకి సిద్దమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు పొసగలేదు.
మండలపరిధి లోని కదిరి - హిందూపురం ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాన రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.
కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి.. పాశవికంగా వ్యవహరించిన ప్రభుత్వాలను పడగొట్టామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈనెల 18వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఖమ్మం జిల్లా ఏదులాపురానికి విచ్చేస్తున్నారు. అక్కడ జరిగే ఆయా పనులకు ఆయన శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే జిల్లాలో జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో పాల్గొననున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రధాని మోదీపై కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని చెప్పుకొచ్చారు. అంతేకానీ ప్రధానమంత్రిపై వ్యక్తిగత ధూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.