రోడ్డు వేయాలి: సీపీఐ
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:35 PM
కంబళదిన్నె- ఎమ్మిగనూరు రోడ్డును వేయాలని సీపీఐ నాయకులు భాస్కర్యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, చంద్ర, తిక్కన్న డిమాండ్ చేశారు.
పెద్దకడబూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కంబళదిన్నె- ఎమ్మిగనూరు రోడ్డును వేయాలని సీపీఐ నాయకులు భాస్కర్యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, చంద్ర, తిక్కన్న డిమాండ్ చేశారు. శుక్రవారం కంబళదిన్నె రహదారిలో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ కంబళదిన్నె- ఎమ్మిగనూరు రహదారి పూర్తి అధ్వానంగా మారిందన్నారు. నాగరాజు, రాము, బడేసాహెబ్, ఉసేన్సాబ్, నాగప్ప పాల్గొన్నారు.