Lokesh: అరటి రైతులకు లోకేష్ ఇచ్చిన హామీ ఏమిటంటే..?
ABN, First Publish Date - 2023-01-31T20:34:46+05:30
ఐదో రోజు నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర ముగిసింది. దానమయ్యగారిపల్లె నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది.
చిత్తూరు: ఐదో రోజు నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర ముగిసింది. దానమయ్యగారిపల్లె నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. కుమ్మరమాడుగు దగ్గర విద్యార్థులు, అరటి రైతులతో లోకేష్ మాట్లాడారు. ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ ఎదుట రైతులు వారి గోడువినిపించారు. ఎరువులు, కూలీలు, విత్తనం ధరలు భారీగా పెరిగినట్టు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేక పెట్టుబడి పైసలు కూడా రావడం లేదని అరటి రైతులు వాపోయారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. గిట్టు బాటు ధర లేక అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - 2023-01-31T20:51:29+05:30 IST