ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫొటో తీయాలంటూ.. మహిళను ముఖం కడుక్కుని రమ్మన్న యువకులు.. కాసేపటికి..

ABN, First Publish Date - 2022-11-25T16:05:56+05:30

కొన్నిసార్లు దొంగల తెలివితేటలు చూస్తే వామ్మో!.. ఇలాక్కూడా మోసాలకు పాల్పడవచ్చా.. అనే విధంగా ఉంటాయి. వారి మాటలు వింటే చదువుకున్న వారు కూడా బోల్తా పడేలా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు దొంగల తెలివితేటలు చూస్తే వామ్మో!.. ఇలాక్కూడా మోసాలకు పాల్పడవచ్చా.. అనే విధంగా ఉంటాయి. వారి మాటలు వింటే చదువుకున్న వారు కూడా బోల్తా పడేలా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ చివరకు అమాయకులను మోసం చేయడమే పనిగా పెట్టుకుంటుంటారు. తాజాగా బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ మహిళ వద్దకు వెళ్లిన ఇద్దరు యవకులు.. ఫొటో తీయాలి, ముఖం కడుక్కుని రమ్మని సూచించారు. బాత్రూంలోకి వెళ్లిన ఆమె.. తిరిగి వచ్చి చూసి షాక్ అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Viral Video: అన్న కోసం చెల్లెలు త్యాగం చేస్తే.. చివరకు ఈ అన్న ఏం చేశాడో చూడండి..

బీహార్‌లోని (Bihar) చాంద్‌పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నాన్‌కర్ ప్రాంతంలో దేవంతి దేవి అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల దేవంతి పేరు మీద ప్రభుత్వ మరుగుదొడ్డి మంజూరైంది. దీంతో ఇటీవల వారు మరుగుదొడ్డి (toilet) నిర్మాణం పూర్తి చేశారు. ఇదిలావుండగా, ఇటీవల ఇద్దరు వ్యక్తలు ఆమె ఇంటి వద్దకు వచ్చారు. తాము ప్రభుత్వ సిబ్బంది అని, మరుగుదొడ్డి వెరిఫికేషన్ కోసం వచ్చామని చెప్పారు. పూర్తయిన మరుగుదొడ్డి ఎదురుగా నిలబడితే ఫొటో తీస్తామని, తద్వారా మీకు రావాల్సిన డబ్బులు వస్తాయని చెప్పడంతో ఆమె పూర్తిగా నమ్మింది.

WhatsApp Video call: వాట్సప్‌ కాల్‌ను లిఫ్ట్ చేయడమే అతడి పాలిట శాపమైంది.. రూ.63 వేలు పోయినా..

అయితే ఫొటో తీసేటప్పుడు మెడలో నగలు ఏవీ ఉండొద్దని, పేదింటి మహిళ మాదిరి కనిపించాలని సూచించారు. దీంతో ఆమె మెడలో ఉన్న నగలు అన్నింటినీ తీసి టేబుల్ మీద పెట్టింది. తర్వాత మొఖం కడుక్కొని రావాలని సూచించడంతో బాత్రూంలోకి వెళ్లింది. అయితే తిరిగి వచ్చి చూస్తే.. ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించలేదు. అలాగే టేబుల్ మీద ఉన్న బంగారు ఆభరణాలు (Gold jewelry) కూడా అదృశ్యమయ్యాయి. చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల పోలీసులకు సవాల్‌గా మారాయి. చాలా మంది ఇలా వివిధ రకాలుగా మాయమాటలు చెబుతూ మోసం చేస్తుంటారని, కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..

Updated Date - 2022-11-25T16:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising