Home » Bihar
ఈ మధ్యకాలంలో అమ్మాయిని అమ్మాయి, అబ్బాయిని అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. వినడానికి, చూడ్డానికి ఇది వింతగానే అనిపించినా.. ఇలాంటి సంఘటనలు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో జరిగాయి. బీహార్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
గతంలో తాను విన్న దానికంటే బిహార్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని శశిథరూర్ అన్నారు. రోడ్డు బాగున్నాయని, ఇంతకుముందెన్నడూ లేని విధంగా అర్థరాత్రి కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఏ స్థాయిలో పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు రుజువు కాగా.. తాజాగా బిహార్ లో మరోసారి నిరూపితమైంది. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 935 పోస్టులకు 9.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
డిఫెన్స్ కారిడార్, సెమికండక్టర్ తయారీ పార్క్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, మెగా టెక్ సిటీ, ఫిట్నెస్ సిటీ ఏర్పాటుతో బీహార్ను ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్గా తయారు చేయాలని మంత్రివర్గ మావేశంలో నిర్ణయించినట్టు సీఎస్ తెలిపారు.
పార్టీ మౌలిక సిద్ధాంతాలు, ప్రవర్తనా నియమావాళికి భిన్నంగా ఈ నేతలు పార్టీ వెలుపల వేదికలపై తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీపీసీసీ పేర్కొంది.
బిహార్ ఎన్నికల్లో అవకతవకలు జరిగే ఉంటాయని తనకు అనిపిస్తోందని జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తమ పార్టీకి క్షేత్రస్థాయిలో లభించిన మద్దతుకు, పోలింగ్ సరళికి పొంతన లేదని తెలిపారు.
బిహార్ ముఖ్యమంత్రిగా ఇవాళ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. బీహార్ పర్యటన మొత్తం మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించిన ప్రధాని మోదీ నేడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నారు.
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్తో పాటు 27 మంది మంత్రులు కూడా తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నితీశ్కు శుభాకాంక్షలు తెలిపారు.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సమర్పించారు.
ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి తదితరులు పాల్గొన్నారు.