Home » Bihar
పూర్ణియా సీటును వదులుకునే ప్రసక్తే లేదని పప్పు యాదవ్ అంటున్నారు. అవసరమైతే ఈ ప్రపంచాన్ని వీడేందుకు సిద్ధం. కానీ పూర్ణియాలోని ప్రజలకు ఎప్పటికీ దూరం అవనని తేల్చి చెప్పారు. పూర్ణియా లోక్ సభ స్థానాన్ని తాను వీడటం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టేనని ప్రకటించారు. ఇక్కడ బీజేపీని నిలువరించేందుకు గత 40 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నానని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ (Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. బీహార్(BIHAR)లో మాత్రం నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది.
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు, అక్కడి నుంచి తిరుగు పయనమవుతున్న వారిలో రైళ్లు రద్దీగా మారాయి. నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫార్మ్ కాని పరిస్థితి.
బీహార్ ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్టే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క తేలలేదు. సంకీర్ణ ధర్మాన్ని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది. కలిసి సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఏకపక్షంగా 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 4 నాలుగు స్థానాలు ఇందులో ఉన్నాయి.
లోక్ సభ ఎన్నికల వేళ బీహార్ కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది. ప్రాంతీయ పార్టీ జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ హామీ మేరకు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశామని జన్ అధికార్ పార్టీ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేయడం వల్ల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
తొలిదశ పోలింగ్ జరగనున్న 102 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో మెజార్టీ స్థానాల్లో గెలపు కోసం ఎన్డీయే, ఇండియా కూటమిలు ప్రయత్నిస్తుండగా.. ప్రాంతీయ పార్టీలు సైతం తమ ప్రభావం చూపించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్లో 6, బీహార్లో నాలుగు స్థానాల్లో తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి.
బీహార్ లో బీజేపీ తంత్రం ఫలించింది. రెండు లోక్సభ సీట్లు అడిగితే ఒకటే ఇచ్చారంటూ ఎన్డీయేపై అలిగి కూర్చున్న కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ను బీజేపీ శాంతపరిచింది. ఆర్ఎంఎల్కు ఎమ్మెల్సీ సీటును బీజేపీ ఆఫర్ చేసింది.
లోక్ సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య పక్షం రాష్ట్రీయ్ లోక్ జనశక్తి పార్టీ కూటమి నుంచి వైదొలగనుంది. ఇటీవల బీహర్ లోక్ సభసీట్లలో జరిగిన కేటాయింపులపై ఆర్ఎల్జీపీ అధినేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్ గుర్రుగా ఉన్నారు. టికెట్ల విషయంలో బీజేపీ తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అంటున్నారు. సీట్ల కేటాయింపుపై బీజేపీ నాయకత్వం పునరాలోచించాలని కోరారు. బీజేపీ అధినాయకత్వం స్పందించకపోవడంతో కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు.
బీహార్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. 17 సీట్లలో బీజేపీ పోటీ చేయనుండగా, నితీష్కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్ 16 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ విషయాన్ని సోమవారంనాడు ప్రకటించారు.
లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు రోహిణి ఆచార్య లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. లాలు కుటుంబానికి కంచుకోట అయిన సరన్ లోక్ సభ నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ప్రస్తుతం లాలు కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, పెద్ద కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నారు.