ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konark Express: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ

ABN, Publish Date - Feb 18 , 2025 | 04:25 AM

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు ప్రయాణికులను తోటి ప్రయాణికుడు మోసం చేశాడు. దాంతో బాధితులు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • టీలో మత్తు మందు కలిపి ఇద్దరు ప్రయాణికుల డబ్బు, నగలు దోచుకున్న తోటి ప్రయాణికుడు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు ప్రయాణికులను తోటి ప్రయాణికుడు మోసం చేశాడు. దాంతో బాధితులు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌కు చెందిన సత్యవతి అనే మహిళ కుమారుడు శశికుమార్‌తో కలిసి ఓ శుభకార్యం కోసం వారం రోజుల క్రితం రాజమండ్రికి వెళ్లారు. ఈనెల 15వ తేదీ రాత్రి వారు సికింద్రాబాద్‌కు వచ్చేందుకు రాజమండ్రిలో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగిలోఎక్కారు. రైలు ఫ్లాట్‌ఫాంపై ఉండగానే చాయ్‌(టీ) అమ్ముకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు.


అప్పుడు 45 ఏళ్ల వయసున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి సత్యవతి వాళ్ల ఎదురుగా కూర్చుని, టీ తాగాలని సత్యవతి, శశికుమార్‌కు ఇచ్చాడు. దాంతో ఆ వ్యక్తితో కలిసి వారు టీ తాగారు. ఆ తర్వాత సత్యవతి, శశికుమార్‌ స్పృహ కోల్పోయారు. 16వ తేదీ ఉదయం రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోకముందే వారిద్దరూ స్పృహలోకి వచ్చారు. బ్యాగులు చూసుకోగా తమ బ్యాగులో ఉండాల్సిన 25 గ్రాముల బంగారు గొలుసు, రూ 6 వేలు నగదు కనిపించలేదు. మోసపోయామని గ్రహించిన సత్యవతి, శశికుమార్‌ సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో జరిగింది కాబట్టి ఈ కేసును రాజమండ్రి జీఆర్‌ిపీ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Feb 18 , 2025 | 04:25 AM