Home » Secunderabad
జనవరి ఒకటో తేదీ నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. లింగంపల్లి-విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్కు అనపర్తి స్టేషన్లో హాల్ట్ కల్పిస్తున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ నాచారం ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆ ఏరియాల్లో నిర్మాణుష ప్రదేశాలను అడ్డాలుగా చేసుకున్న కొందరు విక్రయాలు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి 44.854 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.
మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో.. మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన సికింద్రాబాద్ హబ్సిగూడలో చోటుచేసుకుంది. సిరి వైష్ణవి(15) అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. మార్కులు తక్కువగా వస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించే భక్తులకు గుడ్న్యూస్. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే 60 పైగా ప్రత్యేక రైళ్లు నడుపబోతోంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు..
ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.
దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రూ.6,635 కోట్ల ఆదాయం లభించగా, ప్రయాణికుల విభాగం నుంచి రూ.2,991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
రైల్వే స్టేషన్లో మహిళ నుంచి 8 కిలోల గంజాయి సరుకును సికింద్రాబాద్ రైల్వే, సికింద్రాబాద్ ఆర్పీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్లు వివరాలను వెల్లడించారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. సికింద్రాబాద్ (సనత్నగర్)- వాడి మార్గంలో 173 కి.మీ. పొడవైన 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.