Home » Secunderabad
ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్కాగజ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి వరంగల్, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో నడిచే 4 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24వతేదీనుంచి నుంచి ఈ అదనపు ఏసీబోగీల ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వద్ద బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్మీ వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో స్కూలుకు వెళ్తున్న ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.
భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ఈవెంట్ గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని తెలిపారు.
సికింద్రాబాద్ పరిధిలోని భోలక్పూర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం తీవ్రంగా ఉండటంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్ వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్ మధ్య నడుతున్న ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
జనవరి ఒకటో తేదీ నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. లింగంపల్లి-విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్కు అనపర్తి స్టేషన్లో హాల్ట్ కల్పిస్తున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ నాచారం ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆ ఏరియాల్లో నిర్మాణుష ప్రదేశాలను అడ్డాలుగా చేసుకున్న కొందరు విక్రయాలు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.