ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Panchayat Election: రూ.27.60 లక్షలకు సర్పంచ్‌ పదవి వేలం!

ABN, Publish Date - Feb 10 , 2025 | 04:02 AM

పంచాయతీ ఎన్నికల అంటే పల్లెల్లో మామూలుగా ఉండదు. ప్రత్యర్థుల పోటాపోటీ రాజకీయాలతో హైటెన్షన్‌ వాతావరణమే ఉంటుంది.

  • ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట

  • 12 మంది పాల్గొన్నట్టు సమాచారం

  • జోగుళాంబ గద్వాల జిల్లా గోకులపాడు గ్రామంలో ఘటన

మానవపాడు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల అంటే పల్లెల్లో మామూలుగా ఉండదు. ప్రత్యర్థుల పోటాపోటీ రాజకీయాలతో హైటెన్షన్‌ వాతావరణమే ఉంటుంది. మాకెందుకు ఇదంతా..!! అని అనుకున్నారో ఏమో కానీ ..!! రాష్ట్రంలోని ఓ గ్రామ సర్పంచ్‌ పదవిని ఆ ఊరి పెద్దలంతా కలిసి వేలం వేసి విక్రయించేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ.27.60 లక్షలకు ఓ వ్యక్తి సర్పంచ్‌ పదవిని ఆ వేలంలో కొనేశాడని తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వెలువడకముందే ఈ వ్యవహారం జరగడం విశేషం. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని గోకులపాడు గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.


గోకులపాడులో 546 మంది ఓటర్లు ఉండగా.. సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దల సమక్షం లో ఆదివారం నిర్వహించిన వేలంపాటలో దాదాపు 12 మంది పాల్గొన్నారట. ఇందులో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.27.60 లక్షలు పాడి సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నాడట. అయితే, సర్పంచ్‌ పదవి కోసం కాదు.. గ్రామాభివృద్ధి, ఆలయ నిర్మాణం కోసం వేలం పాట నిర్వహించామని కొందరు అంటుంటే.. అసలు వేలంపాటే జరగలేదని గ్రామానికి చెందిన మరికొందరు అంటుండడం గమనార్హం.

Updated Date - Feb 10 , 2025 | 04:02 AM