New Year: న్యూ ‘ఇయర్’ జోష్..
ABN, Publish Date - Jan 01 , 2025 | 06:54 AM
శేరిలింగంపల్లి(Sherilingampally) ఐటీ నియోజకవర్గంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే న్యూ జోష్ మొదలైంది. డిసెంబర్ 31 మంగళవారం అర్ధరాత్రితో 2024 సంవత్సరం ముగిసి 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు యువత, చిన్నారులు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు.
- జోరుగా కేక్ల విక్రయాలు
- రద్దీగా రహదారులు, షాపింగ్మాల్స్
మియాపూర్(హైదరాబాద్): శేరిలింగంపల్లి(Sherilingampally) ఐటీ నియోజకవర్గంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే న్యూ జోష్ మొదలైంది. డిసెంబర్ 31 మంగళవారం అర్ధరాత్రితో 2024 సంవత్సరం ముగిసి 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు యువత, చిన్నారులు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. బేకరీల వద్ద కేక్ల కొనుగోళ్లతో సందడి వాతావరణం నెలకొంది. గేటేడ్ కమ్యూనిటీ వాసులు పెద్దఎత్తున మ్యూజిక్, కల్చరల్ యాక్టివిటీస్ కార్యాక్రమాలు ముందుగానే ప్రారంభమయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: ఆపరేషన్ చబూత్రలో 103 మంది అదుపులోకి
శేరిలింగంపల్లి ఐటీ నియోజకవర్గం(Sherilingampally IT constituency) ప్రాంతంలో 2025 సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఫ్యామిలీలు, యువత ఏర్పాట్లు చేసుకున్నారు. న్యూ ఇయర్(New Year) వేడుకల్లో ఎలాంటి అపశృతి జరగకుండా సంతోషాలతో జరుపుకోవాలని ఈవెంట్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి తగిన సూచనలను చేశారు.
ప్రభుత్వం నిబంధనలను అనుసరిస్తూ వేడుకలను ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని సూచించారు. ఈవెంట్ పరిసరాల్లో ఏమైనా సంఘటన లు జరిగితే వాటికి ఈవెంట్ నిర్వాహకులే బాధ్యత వహించాలని సూచించడంతో ఈవెంట్ల నిర్వాహకులు భద్రతా చర్యలు తీసుకొని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు
ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905
ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు
Read Latest Telangana News and National News
Updated Date - Jan 01 , 2025 | 06:54 AM