ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medak: మెదక్‌ జిల్లాలో 9 వేల కోళ్ల మృతి

ABN, Publish Date - Mar 01 , 2025 | 04:40 AM

మెదక్‌ జిల్లాలో 9 వేల కోళ్లు మృతి చెందాయి. కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామంలో బర్డ్‌ ఫ్లూతో 8 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.

కౌడిపల్లి/నర్సాపూర్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ జిల్లాలో 9 వేల కోళ్లు మృతి చెందాయి. కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామంలో బర్డ్‌ ఫ్లూతో 8 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన లింబాద్రి అనే రైతు రూ.20 లక్షలతో తన సొంత స్థలంలో పది వేల కోళ్లతో ఫౌలీ్ట్రఫాం నడుపుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా 8 వేల కోళ్లు చనిపోయాయి. దీంతో రైతు బోరున విలపించాడు. తనను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.


అయితే, కోళ్లు ఎందుకు చనిపోయాయనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు వెటర్నరీ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు. మరోవైపు.. నర్సాపూర్‌ మండలం అచ్చంపేటలోని ఓ కోళ్లఫాంలో సుమారు వెయ్యి కోళ్లు మృతి చెందాయి. గ్రామానికి చెందిన పాపయ్య కోళ్లఫాం నడుపుతుండగా, నాలుగు రోజులుగా సుమారు వెయ్యి కోళ్లు చనిపోయాయి. శుక్రవారం సాయంత్రం వాటిని ఖననం చేశారు.

Updated Date - Mar 01 , 2025 | 04:40 AM