Home » Medak
క్రిస్మస్ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి.
రెండు సంవత్సరాలైతే చాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత గులాబీ జెండా ఎగురుతుందన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది.
మహిళలకు కాంగ్రెస్ సర్కార్ చీరలు పంపిణీ చేసే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ కేవలం ఎస్హెచ్జీ గ్రూప్లో ఉన్న 40 లక్షల మంది మహిళకు మాత్రమే చీరలు ఇస్తున్నారని అన్నారు.
ప్రజల సొమ్ముల్ని నెల నెలా జీతాల రూపంలో పుష్కలంగా అందుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆ జనాలకే చుక్కలు చూపిస్తున్నారు. నెలకు ఠంచనుగా జీతాలు అందుకుంటూనే లంచాలు ఆశిస్తూ ప్రజలకు ముందు నవ్వులపాలవుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
10 ఏళ్లు అధికారంలో ఉండి అలా అనడం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి. ఒక మాజీ ఎమ్మెల్యేతో తనను తిట్టించడం దారుణమని మండిపడ్డారు. హరీష్ భజన మండలితో తనను తిట్టించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
న్యాయం కోసం పోరాడిన తమకు న్యాయం లభించలేదని శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరీ మావోయిస్టులను చంపుతోందని ఆరోపించింది.