Home » Medak
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో ఇస్తున్నట్టు దేశంలో ఎక్కాడా కూడా సన్నబియ్యం పంపిణీ జరగడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 3.42 కోట్ల మందికి రూ.14800 కోట్లతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సీఎం పంపిణీ చేయనున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాఖాలో ఫేక్ డాక్టర్ బాగోతం వెలుగుచూసింది. జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడింది.
అధిక లాభాల ఆశ చూపి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కొట్టేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి పెద్ద మొత్తం డబ్బులు వస్తాయని నమ్మించి ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.33 లక్షల మేర పెట్టుబడి పెట్టించారు నిందితులు.
ఒకప్పుడు వాకిళ్లలోతెల్లవారుజామున అలుకు(కల్లాపి) చల్లి ముగ్గులు వేయడం నిత్యకృత్యంగా కని పించేది.
మానవుడికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒక్కటి. వీటిని అకాకరకాయ, అడవి కాకరకాయ అని పిలుస్తారు.
మెదక్ జిల్లా తూప్రాన్లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్లో కనిపించిన పెట్టుబడి ప్రకటనను నమ్మిన ఓ వ్యక్తి.. వాట్సాప్ గ్రూపులో చేరి నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఏకంగా రూ.72.69 లక్షలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..
దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్లలో మూడు తెలంగాణాకు రాబోతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ బుల్లెట్ ట్రైన్ల ద్వారా రూ.5 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ఈ మూడు బుల్లెట్ ట్రైన్లు గేమ్ చెంజర్ కాబోతున్నాయని వివరించారు.
ఇస్నాపూర్లో అదృశ్యమైన బిహార్కు చెందిన నలుగురు బాలికలు సురక్షితంగా ఉన్నారని పటాన్చెరు పోలీసులు ఆదివారం వెల్లడించారు. మరికాసేపట్లో తల్లిదండ్రులకు ఆ బాలికలను అప్పగిస్తామని తెలిపారు.