Home » Medak
మహిళలకు కాంగ్రెస్ సర్కార్ చీరలు పంపిణీ చేసే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ కేవలం ఎస్హెచ్జీ గ్రూప్లో ఉన్న 40 లక్షల మంది మహిళకు మాత్రమే చీరలు ఇస్తున్నారని అన్నారు.
ప్రజల సొమ్ముల్ని నెల నెలా జీతాల రూపంలో పుష్కలంగా అందుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆ జనాలకే చుక్కలు చూపిస్తున్నారు. నెలకు ఠంచనుగా జీతాలు అందుకుంటూనే లంచాలు ఆశిస్తూ ప్రజలకు ముందు నవ్వులపాలవుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
10 ఏళ్లు అధికారంలో ఉండి అలా అనడం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి. ఒక మాజీ ఎమ్మెల్యేతో తనను తిట్టించడం దారుణమని మండిపడ్డారు. హరీష్ భజన మండలితో తనను తిట్టించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
న్యాయం కోసం పోరాడిన తమకు న్యాయం లభించలేదని శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరీ మావోయిస్టులను చంపుతోందని ఆరోపించింది.
మెదక్ జిల్లా జానకంపల్లి పంచాయతీ సమీపంలోని ఒక తండా నుంచి కూలీ పని కోసం ఓ మహిళ మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చింది. కూలీ పని ఉందని నమ్మించిన దుండగులు.. కోల్పారం మండలం అప్పాజిపల్లి శివారు ఏడుపాయల రోడ్డు వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం జెండా ఎగిరితీరుతుందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని ఆయన అభివర్ణించారు.
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగిందని మంత్రి పొన్నం అన్నారు. గవర్నర్ దానిని ఆమోదించలేదని.. ఆ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.