Home » Medak
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్14న రామాయంపేటకు చెందిన నందిని డెలివరీ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతోందని డాక్టర్ సింధూరి కాటన్ పెట్టారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి.
రైతులు బాధపడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోతల సీజన్ వచ్చినప్పుడల్లా రివ్యూ మీటింగ్లు పెట్టి రైతుల అవసరాలన్నీ తీర్చేవారని గుర్తుచేశారు.
తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని విమర్శించారు.
కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైల్ నుంచి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విడుదలయ్యారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
బెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని... నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు.
మెదక్లో లైఫ్ కేర్ ఆస్పత్రిలో జరిగిన శిశు విక్రయం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుట్టిన ఆడ శిశువును రూ.1.50 లక్షలకు విక్రయించి, తల్లిదండ్రులను మోసం చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
మెదక్ జిల్లా శివ్వంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిది వోల్ట్ల బ్యాటరీ పేలిపోయి శివతేజ అనే బాలుడి చేతి వేళ్లు తెగిపోయాయి.
ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టడం సంచలనం రేపింది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించిన వ్యక్తితో పాటు కండక్టర్ను ఆర్టీసీ అధికారి లంచం అడగటంతో ఈ ఘటన జరిగింది.
ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.