సికింద్రాబాద్ పద్మారావునగర్లో ‘గిరి’ షోరూం
ABN, Publish Date - Feb 20 , 2025 | 05:21 AM
ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్పత్తులకు మూలాధారమైన ‘గిరి’ ట్రేడింగ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన షోరూంను సికింద్రాబాద్లో ఏర్పాటు చేసింది.
అందుబాటులో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్పత్తులు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్పత్తులకు మూలాధారమైన ‘గిరి’ ట్రేడింగ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన షోరూంను సికింద్రాబాద్లో ఏర్పాటు చేసింది. పద్మారావునగర్లోని సర్దార్ పటేల్ కళాశాల ఎదురుగా ఏర్పాటైన ఈ షోరూంను ఇటీవల హైదరాబాద్లోని రామకృష్ణ మఠానికి చెందిన స్వామి పూజానంద లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్లో ఈ సంస్థకు ఇది 3వ షోరూం కావడం విశేషం. ఈ సందర్భంగా సంస్థ సేల్స్ హెడ్ అమర్ గిరీష్ మాట్లాడుతూ, భక్తుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అవసరాలను తీర్చడంతో పాటు నాణ్యమైన ప్రామాణిక ఉత్పత్తులను వారికి చేరువ చేయడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక రాయితీలు కల్పించనునట్లు వివరించారు.
Updated Date - Feb 20 , 2025 | 05:21 AM