ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీ బ్యాంక్‌ మేనేజర్‌ ఉరఫ్‌ లేడీ రౌడీ షీటర్‌

ABN, Publish Date - Jan 02 , 2025 | 04:11 AM

ఏలూరు జిల్లాలో బ్యాంకు మేనేజరు నుంచి లేడీ రౌడీ షీటరుగా అవతరించిన ఈమె హిస్టరీ అంతా ఆగడాలు.. అరాచకాలే! పని చేస్తున్న బ్యాంకులో బంగారం చోరీచేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది.

  • ఏపీలో హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్‌ హిస్టరీ

  • బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరీ

  • దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన

  • స్వగ్రామం చేరుకుని అరాచకాలు

  • రౌడీషీట్‌ తెరిచిన పోలీసులు

  • తాజాగా జనసేన నేతపై దాడి

  • కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి

  • స్పృహ తప్పిన నేత.. ఆస్పత్రిలో చికిత్స

ఏలూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో బ్యాంకు మేనేజరు నుంచి లేడీ రౌడీ షీటరుగా అవతరించిన ఈమె హిస్టరీ అంతా ఆగడాలు.. అరాచకాలే! పని చేస్తున్న బ్యాంకులో బంగారం చోరీచేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది. సొంత గ్రామం మర్రిబంధం చేరుకుని స్థానికంగా అడ్డూఅదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఆమె ఆగడాలు భరించలేక నూజివీడు పోలీసులు రౌడీ షీట్‌ తెరిచారు. అప్పటినుంచి ఆమె అరాచకాలు మరింతగా ముదిరాయి. ఈ క్రమంలో మర్రిబంధంలో మరో ఆగడానికి దావులూరి ప్రభావతి తెర లేపారు. కర్రలు, రాడ్లు తీసుకుని స్థానిక జనసేన నేతపై ఆమె దాడి చేశారు. ఆ నేత చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురిచేసింది. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో బ్యాంక్‌ మేనేజర్‌గా ప్రభావతి కొంతకాలం పనిచేశారు.


నూజివీడు మండలం సీతారామపురానికి చెందిన వైసీపీ నాయకుడు కవులూరి యోగేశ్వరరావు ఈ బ్యాంకులో 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టారు. ఫోర్జరీ సంతకంతో ఆ బంగారం కొట్టేసిన కేసులు ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి కవులూరి యోగికి ప్రభావతికి మధ్య అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులను, తాజాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, వంగలపూడి అనితను సైతం ఆమె కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్న వారు ఈమె విషయంలో ముఖం చాటేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రభావతి కలిశారు. ప్రభావతి వ్యవహారంపై మర్రిబంధంలో స్థానిక జనసేన నాయకులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సమగ్ర వివరాలు కోరారు. ఈ వ్యవహారాలను దోనవల్లి వెంకట్రావు మరిబంధంలో చూస్తున్నారు. అయితే, వెంకట్రావు.. పవన్‌కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చాడని ఆమె కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో బుధవారం వెంకట్రావుపై ప్రభావతి... తన తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమార్‌లతో కలిసి దాడి చేశారు. చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీనిని గమనించిన గ్రామస్థులు, ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. సమాచారం అందుకున్న నూజివీడు రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఆది నుంచి వివాదాలే..

ప్రభావతి ఆది నుంచీ వివాదాస్పదురాలే. సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను కైంకర్యం చేశారు. మర్రిబంధం పక్కనే గల పల్లెర్లమూడిలో బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని బెదిరింపులకు దిగారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. గ్రామంలో ప్రతి రోజూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉండటంతో నూజివీడు రూరల్‌ పోలీసులు ఆమెపై రౌడీషీటర్‌ సైతం నమోదు చేశారు. అయితే, ప్రభావతిపై పోలీసులు చర్యలు చేపట్టడంలో తీవ్ర జాప్యం చేటు చేసుకోవడం వల్లే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభావతి ఒక పథకం ప్రకారం గతంలోనూ, ఇప్పుడూ అధికార పార్టీ నాయకుల పేర్లను వాడుతుండటంతో పోలీసులు ఆమెపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఆమె బాధితులు నానాటికి పెరిగిపోతున్నారు. ఇప్పటికైన పోలీసులు తక్షణం స్పందించి దావులూరి ప్రభావతిని అదుపులోకి తీసుకుని తమకు రక్షణ కల్పించాలని మర్రిబంధం గ్రామస్థులు కోరుతున్నారు. కాగా, గాయపడిన వెంకట్రావును కృష్ణా జిల్లా జనసేన నేతలు నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు.

Updated Date - Jan 02 , 2025 | 04:11 AM