కోడలికి మళ్లీ పెళ్లి
ABN, Publish Date - Apr 26, 2025 | 02:16 PM
గుజరాత్లోని అంబాజీ టౌన్కు చెందిన ప్రవీణ్ సింగ్ రాణా అనే వ్యక్తి కొడుకుకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. ఇటీవల అతని కొడుకు గుండెపోటుతో మరణించాడు. ఆరు నెలల పసిపాపతో విధవరాలుగా ఉన్న తన కోడలిని చూసి బాధతో, తన కొడుకు స్నేహితుడికి ఇచ్చి మళ్లీ వివాహం జరిపించాడు. కన్నీటితో తన కోడలిని అత్తగారింటికి సాగనంపడం చూసి, ప్రవీణ్ సింగ్ రాణాను స్థానికులు ప్రశంసించారు.
Updated Date - Apr 26, 2025 | 02:16 PM