ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

4 నెలల తర్వాత మృతదేహం

ABN, Publish Date - Apr 12, 2025 | 02:21 PM

ఆస్తి కోసం కూతురును చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి.. 4 నెలల తర్వాత మృతదేహం లభ్యం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన పీనా నాయక్‌కు 30 ఏళ్ల కింద వివాహం అవ్వగా ఒక కూతురు, ఒక కుమారుడు.. 2003లో విడాకులు తీసుకున్నప్పటి నుండి కూతురు మహేశ్వరి తండ్రి దగ్గరే పెరిగింది అనంతరం 2003లోనే పీనా నాయక్‌, లలిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.. ఈమెకు ఒక కూతురు ఉంది.. కూతురు మహేశ్వరి బీఎస్సీ నర్సింగ్ చేసి, ప్రైవేట్ ఉద్యోగం చేసింది అక్కడ పరిచయం అయిన యువకుడిని మహేశ్వరి పెళ్లి చేసుకోగా, కొంతకాలానికి వివేదాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.. ఆ తర్వాత కూతురు మహేశ్వరి రెండో వివాహం కోసం తండ్రి భారీగా డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు బోడుప్పల్ లో తనకున్న రెండు ఇండ్లలో ఒకటి మహేశ్వరికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు.. దీంతో ఆస్తి పోతుందని సవతి తల్లి లలిత, తన మరిది సీఆర్పీఎఫ్ జవాన్ బానోత్ రవి, అతడి స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని చంపాలని పథకం వేశారు గతేడాది డిసెంబర్ 7న ఉద్యోగ పనులపై పీనా నాయక్ బయటకు వెళ్లిన సమయం చూసి ఈ ముగ్గురు మహేశ్వరిని చంపి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసి నదిలో పూడ్చి పెట్టారు పీనా నాయక్ తిరిగి ఇంటికి రాగానే కూతురు వేరే అతనితో వెళ్లిపోయిందని, ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భార్య లలిత నమ్మించింది.. దీంతో మౌనంగా ఉన్న పీనా నాయక్ 4 నెలలవుతున్నా కూతురు జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు పోలీసుల విచారణలో మహేశ్వరిని ఆస్తి కోసం చంపినట్టు అంగీకరించగా, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు

Updated Date - Apr 12, 2025 | 02:21 PM