సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
ABN, Publish Date - Feb 16 , 2025 | 08:36 AM
మహబూబ్నగర్: సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పుర స్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా గడియారం చౌరస్తా నుంచి అయ్యప్ప కొండ దగ్గరికి ర్యాలీగా బయలుదేరి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్విహించారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా మందిరం వద్ద యాగం నిర్వహిస్తున్న నేతలు..
సేవాలాల్ జయంతి నేపథ్యంలో మహబూబ్నగర్ గడియారం చౌరస్తా నుంచి అయ్యప్ప కొండ దగ్గరికి ర్యాలీగా బయలుదేరిన పూజారులు, భక్తులు..
శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ..లంబాడీ మహిళలతో నృత్యం చేస్తున్న దృశ్యం..
Updated Date - Feb 16 , 2025 | 08:36 AM