Ganesh Immersion: గణేశ్ నిమజ్జనం వేళ.. లైటింగుల వెలుగులో ట్యాంక్ బండ్
ABN, Publish Date - Sep 05 , 2025 | 09:32 PM
గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ల వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నిమజ్జనం కోసం ఆ పరిసర ప్రాంతాల్లో 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జనం ప్రక్రియ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం పోలీసులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను సైతం రంగంలోకి దింపింది.
గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశారు.
విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకెళ్లాల్సి ఉంటుందని భక్తులకు ప్రభుత్వం సూచించింది.
ఈ నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాలు తీసుకు వెళ్లేందుకు నగరంలో మ్యాప్ ద్వారా రూట్స్ డిసైడ్ చేశారు.
మండపాల నిర్వాహకులు ఈ సూచనలు పాటించాల్సి ఉంది. ఇక రహదారులపై డైవర్షన్ ఉన్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటికి అనుగుణంగా వినాయకులను తీసుకెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది.
ఈ నిమజ్జనం వేళ.. 29 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. రేపు అంటే.. శనివారం మధ్యాహ్నం 1 గంట లోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.
శనివారం ఒక్క రోజే.. సుమారు 50 వేల విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. గణేశ్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు.
నగర వ్యాప్తంగా నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను అధికారులు ఏర్పాటు చేశారన్నారు. ఖైరతాబాద్ నిమజ్జనం చూడటానికి 40 లక్షల మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారని వివరించారు.
Updated Date - Sep 05 , 2025 | 09:41 PM