PM Modi-Diwali: ఈ పేరు వింటే పాక్కు వణుకే: ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై మోదీ దీపావళి వేడుకలు
ABN, Publish Date - Oct 20 , 2025 | 09:53 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకోవడం ఆనవాయితీ.. అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు
‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై మోదీ దీపావళి వేడుకలు
నిన్న (ఆదివారం) రాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్కు వెళ్లిన ప్రధాని.. ఈ ఉదయం నేవీ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు. ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు
నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అని ప్రధాని చెప్పారు
ఈ దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓవైపు నాకు మహా సముద్రం.. మరోవైపు భరతమాత అందించిన ధీర జవాన్ల బలం కన్పిస్తోంది
ఆపరేషన్ సిందూర్లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు
సైనిక దుస్తులు ధరించి.. దళాలతో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడిపారు ప్రధాని మోదీ
INS విక్రాంత్లో నావికాదళాలతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ యోగా
యోగా మనల్ని ఏకం చేస్తూ, మన శారీరక, మానసిక శ్రేయస్సును బలోపేతం చేస్తుందన్న ప్రధాని
నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా
Updated Date - Oct 20 , 2025 | 09:53 PM