Today Horocope: ఈ రెండు రాశుల చుట్టూ తిరుగుతున్న అదృష్ట చక్రం
ABN, Publish Date - May 24 , 2025 | 12:26 AM
ఈ రోజు విద్య, రవాణా, రాజకీయాలు, సినిమాలు వంటి రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. శ్రద్ధ, శాంతితో వ్యవహరిస్తే ఆర్థిక, వ్యక్తిగత రంగాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి.
నేడు 24-05-2025, శనివారం విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. రవాణా, బోధన, కమ్యూనికేషన్లు, స్టేషనరీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. తోబుట్టువులు, సన్నిహితుల వ్యవహార శైలి ఆవేదన కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం అందక పోవడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులు, నిధుల సేకరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వర వ జ్ర కవచ పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థలతో పనులు పూర్తి చేయగలుగుతారు. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
రుణప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది. పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు సంకల్పం నెరవేరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. గోమాతను ఆరాధించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారికి అవసరానికి నిధులు సర్దుబాటు అవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతమలు విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. రవాణా, మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. గృహనిర్మాణం, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు అధికం. వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - May 24 , 2025 | 12:31 AM