Jagan Assets Issue: వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం.. జగన్ పిటిషన్పై విచారణ
ABN, Publish Date - Mar 06 , 2025 | 07:31 PM
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో జగన్ పిటిషన్పై విచారణ జరిగింది. షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Jagan Assets Issues: వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ్రయించారు. కాగా, ఇవాళ (గురువారం) ఈ కేసుపై ఎన్సీఎల్టీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల షేర్లు అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ పిటిషన్లో తెలిపారు. షేర్ల బదిలీ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కోరారు.
వైఎస్ విజయలక్ష్మి, షర్మిల, సండూర్ పవర్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ని ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరోవైపు జగన్తో సహా షర్మిల, ఇతర ప్రతివాదులు ఎన్సీఎల్టీలో మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి వాదిప్రతివాదులు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి ఎన్సీఎల్టీ వాయిదా వేసింది.
అయితే, సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలను జగన్ అనవసరంగా లాగుతున్నారని ఇటీవల వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. జగన్, తన భార్య భారతి రెడ్డి ట్రైబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారని విజయలక్ష్మి నివేదించారు. సరస్వతి వాటాలపై సర్వహక్కులూ తనవేనని పేర్కొన్న విజయలక్ష్మి.. ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని, పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లీ కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇంత ఆవేదనకు గురిచేయడం జగన్, భారతిరెడ్డికి ఏ మాత్రం సరికాదన్నారు.
Also Read:
పోసానికి ఓ కేసులో షాక్.. రెండు కేసుల్లో ఊరట
గంజాయి విక్రయిస్తే ఇక అంతే.. హోంమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
Updated Date - Mar 06 , 2025 | 07:59 PM