Home » Jagan
ఈ ఐదేళ్లలో అడ్డగోలుగా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు. కేంద్ర నిధులు దారి మళ్లించారు. ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు పెండింగ్ పెట్టారు. అప్పులు పెరిగాయి కానీ, ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. ‘సంక్షేమం’లోనూ సవాలక్ష నిబంధనలతో కోతలు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జనసేన నేత, స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయ పడ్డారు.
తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తాను జగన్ను పని కావాలని అడిగానని ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి తాను ఏ పని కావాలని అడగలేదని స్పష్టం చేశారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైనదని, అది అమల్లోకి వస్తే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. వెంటనే ...
గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలం తేంపల్లి, కొయ్యూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెంపల్లి గ్రామస్తులు యార్లగడ్డ వెంకట్రావుకు జేసీబీలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లలో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోను ప్రజలు బేరీజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరకొర లబ్ధి చేకూర్చడం మినహా... అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించారనే అన్ని వర్గాల ప్రజలు జగన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అమలు పరిచిన
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలవడని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వివరించారు. ఆ అంశంపై వర్మ స్పందిస్తూ.. ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండు అని ప్రతి సవాల్ విసిరారు.
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ చూపలేదు. ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన నిలబెట్టుకోలేదు. కరువు జిల్లా అనంతలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. యువత పొట్టచేతపట్టుకొని వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బటన నొక్కి.. అంతా చేసేశామనే భ్రమలో జగన ఉన్నారని యువత మండిపడుతోంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత.. ఈ ఎన్నికల్లో కీలక ...
తనది మైనార్టీల ప్రభుత్వమని మోసం చేసిన జగనను ముస్లిం సమాజం ఇక ఎన్నటికీ నమ్మదని శాసన మండలి మాజీ చైర్మన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ మహా సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ జగన హయాంలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని, 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ కూటమిలో ...