ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPM : రాష్ట్రాల అధికారాలను బుల్‌డోజ్‌ చేస్తున్న మోదీ

ABN, Publish Date - Feb 04 , 2025 | 05:50 AM

ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు వంతపాడుతున్నాడు. దేశంలో లౌకిక వాదాన్ని పరిరక్షించడానికి ఎర్ర జెండాలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి.

  • మతతత్వ వ్యతిరేక పోరాటాలకు సీపీఎం సిద్ధం: బృందాకరాత్‌

నెల్లూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల సార్వభౌమాధికారాలను బుల్‌డోజర్‌ పెట్టి తొక్కిస్తున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు వంతపాడుతున్నాడు. దేశంలో లౌకిక వాదాన్ని పరిరక్షించడానికి ఎర్ర జెండాలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. మతతత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడటానికి సీపీఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరాత్‌ అన్నారు. నెల్లూరులో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం 27వ మహాసభలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం నగరంలోని వీఆర్సీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నరేంద్ర మోదీ, చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు సంధించారు. ఆర్థిక గణన సర్వే ప్రకారం గత ఐదేళ్ల మోదీ పాలనలో దేశం 40 సంవత్సరాలు వెనుకబడిపోయిందని అన్నారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందనీ, రాష్ట్ర కేటాయింపుల్లో రూ.1.10 లక్షల కోట్ల కోత పడిందని కరాత్‌ అన్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని అన్నారు. ఆ రోజు చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి అంగీకరించాడన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్‌ టెర్మినల్‌ను అదానీ తరిలించినా చంద్రబాబు దాని గురించి నోరు మెదపడం లేదన్నారు. కంటైనర్‌ టెర్మినల్‌ మూసివేయడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడినా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు.


సుదీర్ఘకాలం మంత్రులుగా ఉన్న వీరు వెలుగొండ, సీతారామ్‌సాగర్‌ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా పార్టీ కార్యదర్శి మూలం రమేశ్‌ అధ్యక్షత వహించిన ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ బేబి, ఎంఏ గఫూర్‌, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తదితర నాయకులు పాల్గొన్నారు. కాగా, సభకు ముందు సీపీఎం నాయకులు, కార్యకర్తలు నగరంలోని ఆత్మకూరు బస్టాండు నుంచి వీఆర్‌సీ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Feb 04 , 2025 | 05:50 AM