ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala : కల్తీ నెయ్యి నిందితుడి బెయిల్‌ పిటిషన్‌

ABN, First Publish Date - 2025-02-12T05:57:44+05:30

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రెండో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు

  • ‘కౌంటర్‌ ఫైల్‌’కు వ్యవధి కోరిన ఏపీపీ

తిరుపతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రెండో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ2 నిందితుడైన ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌కు ఆరోగ్యం బాగాలేదని పేర్కొంటూ బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన 2 ఏడీఎం కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌ కుమార్‌.. ఏపీపీ జయశంకర్‌కు నోటీసులు జారీచేశారు. బెయిల్‌ మంజూరు చేయవద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేసిన ఏపీపీ.. కౌంటర్‌ ఫైల్‌ చేయడానికి నాలుగు రోజులు వ్యవధి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆ మేరకు కోర్టు ఏపీపీకి గడువు ఇచ్చింది.

సిట్‌కు రూ.51 లక్షల బడ్జెట్‌ కేటాయింపు

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సిట్‌(ప్రత్యేక దర్యాప్తు బృందం)కు రాష్ట్ర ప్రభుత్వం రూ.51 లక్షల బడ్జెట్‌ కేటాయించింది. సిట్‌ నిర్వహణకు నిధులు కేటాయించాల్సిందిగా డీజీపీ గత డిసెంబరు 12న లేఖ రాయగా ప్రభుత్వం ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2025-02-12T05:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising