వైసీపీ అధినేతపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..
ABN, Publish Date - Sep 03 , 2024 | 02:09 PM
ప్రకృతి విపత్తులు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన జగన్ కనీసం వారికి ఒక్క భోజనం ప్యాకెట్ కూడా అందించలేదని, అలాంటిది ఇంత కష్టపడుతున్న తమపై విమర్మలు గుప్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: ప్రకృతి విపత్తులు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన జగన్ కనీసం వారికి ఒక్క భోజనం ప్యాకెట్ కూడా అందించలేదని, అలాంటిది ఇంత కష్టపడుతున్న తమపై విమర్మలు గుప్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు విపత్తు సమయంలో సరిగా పని చేయకుంటే ఎవ్వరినీ వదలబోనని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విపత్తు నిర్వహణలో సరిగ్గా పని చేయకుంటే, మంత్రులకైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. జక్కంపూడిలో విధులు సరిగా నిర్వర్తించని ఓ అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశానన్నారు. వీఆర్లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించలేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దీనిపైనా విచారణ జరిపిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
శాంతించిన మున్నేరు.. వాహనాల పునరుద్ధరణ..
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 03 , 2024 | 02:10 PM