శాంతించిన మున్నేరు.. వాహనాల పునరుద్ధరణ
ABN, Publish Date - Sep 03 , 2024 | 09:37 AM
అమరావతి: నందిగామ మండలం, అయితవరం వద్ద జాతీయ రహదారిపైకి వరదనీరు రావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రానికి మున్నేరు శాంతించడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు పునురుద్ధరించారు.
అమరావతి: నందిగామ మండలం, అయితవరం వద్ద జాతీయ రహదారిపైకి వరదనీరు రావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రానికి మున్నేరు శాంతించడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు పునురుద్ధరించారు. జగ్గయ్యపేట మండలం, గరికపాడు వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న వంతెన అప్రోచ్ రోడ్ వరద ఉధృతికి కోసుకుపోయింది. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను విజయవాడ వైపు వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించినప్పటికీ లారీలు, భారీ వాహనాల సిబ్బంది, బస్సుల్లో ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అల్లాడిపోయారు.
వరద మద్యలో మెరక ప్రాంతాల్లో 40కు పైగా వాహనాలు ఇరుక్కుపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, రిస్య్యూ సిబ్బంది క్రేన్ సాయంతో జనాలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా వరద ఉధృతికి ఆరు కార్లు కొట్టుకుపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కృష్ణానదికి వస్తున్న వరదతో ఇబ్రహీంపట్టణం మండలంలోని ఏటుపట్టు గ్రామాలతోపాటు విజయవాడ, హైదరాబాద్.. చుట్టుప్రక్కల గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. దాములూరు, చిలుకూరు, దోనబండ, కొటికలపూడి, మూలపాడు, జూపూడి, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..
జగన్ భక్త అధికారులపై సీఎం సీరియస్..
రిటైనింగ్ వాల్ ఉన్న వరద ఎలా వచ్చింది..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 03 , 2024 | 09:38 AM