భారతి సిమెంట్లో భారీ కుంభకోణం..
ABN, Publish Date - Aug 22 , 2024 | 08:26 AM
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి లీలలు అన్నీ ఇన్నీ కావు. తవ్వేకొద్ది బయటపడుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు తమ స్థాయినిబట్టి దేన్నీ వదలకుండా దోచుకున్నారు. గ్రామ, వార్డు, సచివాలయం నిర్మాణం ముసుగులో అడ్డగోలుగా సిమ్మెంట్ అమ్ముకున్నారు.
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి లీలలు అన్నీ ఇన్నీ కావు. తవ్వేకొద్ది బయటపడుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు తమ స్థాయినిబట్టి దేన్నీ వదలకుండా దోచుకున్నారు. గ్రామ, వార్డు, సచివాలయం నిర్మాణం ముసుగులో అడ్డగోలుగా సిమ్మెంట్ అమ్ముకున్నారు. నిర్మాణాలను గాలికి వదిలేసి.. దొరికినోళ్లు దరికినంత దోచుకున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా మొత్తం రూ. 3వందల కోట్ల విలువైన సిమెంట్ను అప్పనంగా అమ్ముకున్నారు. అన్నీ జిల్లాల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇష్టారీతిగా అమ్ముకున్నట్లు సమాచారం.
గత ప్రభుత్వంలో అవసరం ఉన్నా.. లేకపోయినా.. సచివాలయాల భవనాల నిర్మాణాల కోసమంటూ రూ. 650 కోట్ల విలువైన సిమెంట్ అందజేశారు. అస్మదీయ సిమెంట్ కంపెనీలతోపాటు జగన్ సొంత కంపెనీ భారతి సెమెంట్ నుంచి రూ.83 కోట్ల మేర సిమెంట్ సరఫరా చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆయా సిమెంట్ కంపెనీలు ఒత్తిడి చేసి మీరీ బిల్లులు వసూలు చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో సచివాలయాలకు 25 శాతం సిమెంట్ మాత్రమే వినియోగించారు. మరో 25 శాతం సమెంట్ వర్షాకాలంలో చెడిపోకుండా ఉందేందుకు.. ఇతర పనులకు ఇంజనీర్లు ఉపయోగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ కేసులో వైసీపీ నేతలకు బిగిస్తున్న ఉచ్చు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 22 , 2024 | 08:26 AM