Hyderabad: బ్యాంక్లో అక్రమాలు.. బినామీల పేర్లతో రుణాలు.. ఈడీ సోదాల్లో విస్తుపోయే నిజాలు..
ABN, Publish Date - Aug 01 , 2024 | 06:54 PM
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఓసారి బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు కోట్లు కొట్టేస్తే.. ప్రస్తుతం బ్యాంకు అధికారులే అక్రమాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి
మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఓసారి బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు కోట్లు కొట్టేస్తే.. ప్రస్తుతం బ్యాంకు అధికారులే అక్రమాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లోని మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్మాల్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజులుగా ఈడీ అధికారులు చేస్తున్న సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బ్యాంక్ ఉద్యోగులు కుమ్మక్కై భారీ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాధమికంగా తేలింది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయాలు మరిన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్కు సంబంధించిన నిధులను భారీగా దారిమళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ అధికారులు మహేష్ బ్యాంక్లో సోదాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
TS Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
ఈడీ అధికారులు ఏమన్నారంటే..
హైదరాబాద్లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు బ్యాంక్లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో కోటి రూపాయిల నగదుతో పాటు 5 కోట్ల రూపాయిల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు. 1800 మందికి డమ్మీ గోల్డ్లోన్స్ ఇచ్చినట్లు తమ సోదాల్లో తేలిందన్నారు. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నారన్నారు. బ్యాంక్లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ తెలిపింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని, వక్ఫ్బోర్డ్కు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని ఈడీ పేర్కొంది.
TG Assembly Sessions: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..
గత రెండు రోజులుగా..
మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్మాల్కు సంబంధించిన కేసులో బ్యాంకు ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, నిబంధనలకు విరుద్ధంగా రూ.300 కోట్లకుపైగా రుణాల మంజూరు, బ్యాంకు నుంచి రూ.18.30 కోట్లు దారి మళ్లింపు ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది. దీనిలో భాగంగా బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, వైస్ చైర్మన్ పురుషోత్తమదాస్, ఎండీ ఉమేష్ చంద్కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించిన విషయం తెలిసిందే.
KTR: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కేటీఆర్ ఆందోళన
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News
Updated Date - Aug 01 , 2024 | 06:54 PM